Karthikeya2: థియేటర్‌లో భావోద్వేగానికి గురైన నిఖిల్‌-చందూ మొండేటి

‘బాహుబలి’, ‘బాహుబలి-2’ తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli). అలాంటి గొప్ప దర్శకుడి ఆశీస్సులు తీసుకోవాలని ఇండస్ట్రీలోని యువ నటీనటులు భావిస్తుంటారు...

Published : 13 Aug 2022 15:13 IST

హైదరాబాద్‌: నిఖిల్‌-అనుపమ పరమేశ్వరన్‌ (Nikhil) ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త చిత్రం ‘కార్తికేయ-2’ (Karthikeya 2). చందు మొండేటి దర్శకుడు. శ్రీ కృష్ణుడి జన్మ రహస్యం, ద్వారకా నగర విశిష్టత తెలియజేసే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ‘కార్తికేయ-2’కి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూసి నటుడు నిఖిల్‌, దర్శకుడు చందు మొండేటి ఆనందం వ్యక్తం చేశారు. ఆడియన్స్‌ రెస్పాన్స్‌ చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన వీరిద్దరూ అక్కడ సందడి చేసి ఆనందంతో ఆలింగనం చేసుకుని.. భావోద్వేగానికి గురయ్యారు. అలాగే ఈ చిత్రాన్ని చూసేందుకు రాజమౌళి దంపతులు, కీరవాణి, ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కు వెళ్లారు. అయితే అదే సమయానికి అనుపమ సైతం అక్కడే ఉన్నారు. సినిమా పూర్తైన తర్వాత రాజమౌళి, కీరవాణి, ఇతర కుటుంబసభ్యులు కారు పార్కింగ్‌ ఏరియాకు వెళ్లగా.. అక్కడికి అనుపమ చేరుకున్నారు. అనంతరం కీరవాణి కాళ్లకు నమస్కరించారు. తమ చిత్రాన్ని చూసేందుకు వచ్చినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. ‘సినిమా బాగుంది, బాగా నటించావు’ అంటూ జక్కన్న ఆమెను మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని