Mahesh Babu: అమ్మ గురించి మహేశ్‌ చెప్పిన మాటలివే..

‘‘నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఏ సినిమా రిలీజైనా ముందు ఆమె ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంటుంది.....

Updated : 28 Sep 2022 12:37 IST

హైదరాబాద్: ‘‘నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఏ సినిమా రిలీజైనా ముందు అమ్మ దగ్గరికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంటుంది. ఆమె ఆశీస్సులు నాకెప్పటికీ ముఖ్యం. ఆమె ఆశీస్సుల వల్లే నాకు ఈ విజయం వచ్చింది’’.. ఇవి ‘మహర్షి’ సక్సెస్‌ మీట్‌లో మహేశ్‌బాబు తన తల్లి ఇందిరా దేవి గురించి మాట్లాడిన మాటలు. బుధవారం తెల్లవారుజామున ఇందిరా దేవి మరణంతో ఈ వీడియోను సోషల్‌మీడియాలో అభిమానులు పోస్టు చేస్తున్నారు.

మాతృమూర్తి పట్ల మహేశ్‌కున్న ప్రేమను ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. #MaheshBabu హ్యాష్‌ట్యాగ్‌ని జత చేస్తూ ‘ధైర్యంగా ఉండండి అన్నా’ అని చెబుతున్నారు. మహేశ్‌ నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలోని తల్లి సెంటిమెంట్‌ సీన్‌ను కూడా షేర్‌ చేస్తున్నారు. తన తల్లి పుట్టిన రోజైన ఏప్రిల్‌ 20 తనకెంతో ప్రత్యేకమని.. అదే రోజున తాను నటించిన ‘భరత్‌ అనే నేను’ విడుదల కావడం ఆనందంగా ఉందని ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మహేశ్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని