Crime News: పంజాగుట్టలో దారుణం... భార్యను హతమార్చి, రైలుకింద పడి భర్త ఆత్మహత్య
నగరంలోని పంజాగుట్టలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య ఏర్పడిన వివాదం నిండు ప్రాణాలను బలితీసుకుంది. మనస్పర్థల కారణంగా క్షణికావేశంలో భార్యను
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య ఏర్పడిన వివాదం నిండు ప్రాణాలను బలితీసుకుంది. మనస్పర్థల కారణంగా క్షణికావేశంలో భార్యను చంపేసిన భర్త.. ఆ తర్వాత తానుకూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... అస్సాం రాష్ట్రానికి చెందిన మహానంద బిశ్వాస్(24), పంప సర్కార్ (22) దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి పంజాగుట్ట పరిధిలోని ప్రేమ్నగర్లో నివాసముంటున్నారు. వీరిద్దరూ జీవీకే మాల్లో సెక్యూరిటీ గార్డ్స్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఈక్రమంలో దంపతుల మధ్య ఏర్పడిన వివాదం ఇద్దరినీ బలితీసుకుందని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం సాయత్రం భార్యను నీళ్లతో ఉన్న బకెట్లో తలవరకు ముంచి హతమార్చాడు. ఆ తర్వాత నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బిశ్వాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే సమయంలో అతని వద్ద ఉన్న చిన్న డైరీలో తన భార్యను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు రాసిన లేఖ లభ్యమైంది. వెంటనే నాంపల్లి రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారంతో పంజాగుట్ట పోలీసులు ప్రేమ్నగర్లోని అతని నివాసానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళం పగులగొట్టి పంప సర్కార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పంజాగుట్ట డీఐ నాగయ్య తెలిపారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్