Crime News: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఎల్బీనగర్కోర్టు తీర్పు వెలువరించింది. 2015లో బాలాపూర్కు చెందిన మైనర్ బాలికపై
హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఎల్బీనగర్కోర్టు తీర్పు వెలువరించింది. 2015లో బాలాపూర్కు చెందిన మైనర్ బాలికపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన రషీద్, చార్మినార్కు చెందిన అక్బర్ ఖాన్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈఘటనపై బాలాపూర్ పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అయితే, కేసు విచారణలో ఉండగానే అక్బర్ఖాన్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన కోర్టు నిందితుడు రషీద్కు 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించింది. దీంతో పాటు బాలికకు బాధితుల పరిహారం కింద రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్