IT Notice: ఐటీ నోటీసులు అందాయా? ముందు లోపమేంటో గుర్తించండి!
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు అనగానే చాలా మంది హడలెత్తిపోతుంటారు. కానీ, అన్ని సందర్భాల్లో భయపడాల్సిన అవసరం లేదు....
ఇంటర్నెట్ డెస్క్: ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు అనగానే చాలా మంది హడలెత్తిపోతుంటారు. కానీ, అన్ని సందర్భాల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఐటీ నోటీసు అంటే మీ ఐటీ పత్రాల్లో సమస్య ఉందని తెలియజేస్తూ పంపే రాతపూర్వక సమాచారం మాత్రమే. దీనికి ఒక్కోసారి మీరు తిరిగి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి అవసరం ఉండదు. కేవలం సమస్య ఉందని తెలియజేసి మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తుంటారు. అందుకే పన్ను చెల్లింపుదారులు నోటీసు అందగానే దాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. తర్వాతే సమాధానం ఇవ్వాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవాలి.
నోటీసు వర్సెస్ సమాచారం..
ఆదాయ పన్ను విభాగం పంపే ప్రతిదీ నోటీసుగానే పరిగణించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కేవలం సమస్య ఉందని తెలియజేసి భవిష్యత్తులో దాన్ని పునరావృతం కాకుండా చూసుకోమని ‘ఇంటిమేషన్’ కూడా పంపుతుంటారు. దీనిపై ఐటీ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోదు. కానీ, నోటీసు మాత్రం దీనికి భిన్నం. మీ ఐటీ పత్రాల్లో గుర్తించిన సమస్య చట్టపరమైన చర్యలకు దారితీయొచ్చు. దీనికి పన్ను చెల్లింపుదారులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో వారు సంతృప్తి చెందకపోతే.. విచారణ చేపట్టి తగు సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటారు.
ఐటీ విభాగం ఏయే సెక్షన్ల కింద నోటీసులు అందజేస్తుంది? వాటి అర్థం ఏంటో చూద్దాం..
సెక్షన్ 139(9): ఐటీ రిటర్నుల్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అధికారులు గుర్తిస్తే ఈ సెక్షన్ కింద నోటీసు జారీ చేస్తారు. దీనికి పన్ను చెల్లింపుదారులు ఆధారాలతో సహా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా నోటీసు అందిన 15 రోజుల్లోగా తప్పును సరిద్దుకోవాలి.
సెక్షన్ 143(1): మీరు ఇంకా ఏదైనా పన్ను బకాయి ఉంటే వెంటనే చెల్లించమని చెబుతూ నోటీసు అందజేస్తారు. 30 రోజుల్లోగా బకాయి చెల్లించాల్సి ఉంటుంది.
సెక్షన్ 143(2), సెక్షన్ 143(3): ఒకవేళ మీ ఐటీ రిటర్నులను పరిశీలన లేదా సమీక్షకు ఎంపిక చేసినట్లయితే.. సెక్షన్ 143 (2) కింద నోటీసు జారీ చేస్తారు. అప్పుడు పన్ను చెల్లింపులుదారులు వారి రిటర్నుల్లో పేర్కొన్న సమాచారానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత సెక్షన్ 143(3) కింద పూర్తిస్థాయి సమీక్షను ప్రారంభిస్తున్నట్లు స్టేట్మెంట్ను పంపిస్తారు. ఈ దశలో మీరు సమర్పించిన ఆధారాలు, రిటర్నుల్లో ఇచ్చిన సమాచారం సరిగ్గా ఉన్నాయా.. లేదా.. లోతుగా చెక్ చేస్తారు. సెక్షన్ 143(1), సెక్షన్ 143(2), సెక్షన్ 143(3) కింద నోటీసులు అందిన 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఏమైనా సర్దుబాట్లు ఉంటే వాటిని ఐటీ అధికారులు తదుపరి సంవత్సరానికి బదలాయిస్తారు.
సెక్షన్ 245: క్రితం ఏడాది పన్ను చెల్లింపు డిమాండ్లు ఏమైనా బకాయి ఉంటే.. వాటిని ఈ ఏడాది రిఫండ్ నుంచి సర్దుబాటు చేస్తున్నట్లు తెలియజేస్తూ ఐటీ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. అందుకు మీరు సమ్మతిస్తున్నారా లేదా తెలియజేస్తూ 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
నోటీసు ఎందుకు పంపారు?
తొలుత అసలు నోటీసు ఎందుకు పంపారో పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాలి. నోటీసులు పంపడానికి చాలా కారణాలుంటాయి. ఐటీఆర్ దాఖలు చేయకపోయినా; వాస్తవం కంటే తక్కువ ఆదాయం చూపినప్పుడు; ఏఐఎస్ (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్-AIS)తో రిటర్నుల సమాచారం సరిపోలకపోవడం.. వంటి సందర్భాల్లో నోటీసులు అందే అవకాశం ఉంది. ఎక్కవ మొత్తం మినహాయింపు కోరినా, ఏదైనా పన్ను ప్రయోజనం కోరినప్పుడు దానికి తగిన ఆధారాలు సమర్పించకపోయినా.. నోటీసులు జారీ చేస్తారు. ఒక్కోసారి పన్ను ఎగవేతను అరికట్టడానికి కూడా నోటీసులు ఇస్తుంటారు. జీవిత భాగస్వామి పేరిట చేసిన పెట్టుబడులపై వచ్చే ఆదాయాన్ని కూడా కచ్చితంగా రిటర్నుల్లో పేర్కొనాల్సి ఉంటుంది. లేదంటే నోటీసులు అందుతాయి.
ఎలా వివరణ ఇవ్వాలి?
నోటీసు అందగానే దాంట్లో పేర్కొన్న శాశ్వత ఖాతా సంఖ్య (PAN), పేరు, ఇతర వివరాలు మీకు సంబంధించినవేనా సరి చూసుకోవాలి. తర్వాత నోటీసు మొత్తాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఏవైనా లోపాలున్నట్లు గుర్తిస్తే దానికి అనుగుణంగా సమాధానం ఇవ్వాలి. కావాల్సిన ఆధారాలు పంపాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి. సకాలంలో స్పందించడం కూడా చాలా ముఖ్యం. లేదంటే ఏవైనా బకాయిలుంటే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఐటీ అధికారులు వారి దగ్గర ఉన్న సమాచారంతో వారి విచక్షణ మేరకు సర్దుబాట్లు చేసే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!